Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపికా పదుకునేతోనా? నో చెప్పిన కోహ్లీ.. ఎందుకు? ధోనీ ఈజ్ బ్యాక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎందుకంటే.. బాలీవుడ్ సుందరి దీపికా పదుకునేతో నటించేందుకు కోహ్లీ నో చెప్పాడట. దీంతో ఐపీఎల్ జట్టు ఆర

Advertiesment
IPL 2018
, శుక్రవారం, 23 మార్చి 2018 (15:35 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎందుకంటే.. బాలీవుడ్ సుందరి దీపికా పదుకునేతో నటించేందుకు కోహ్లీ నో చెప్పాడట. దీంతో ఐపీఎల్ జట్టు ఆర్సీబీకి రూ.11 కోట్ల నష్టం ఏర్పడింది. బెంగళూరు ఐపీఎల్ జట్టు కాంట్రాక్టు ప్రకారం కోహ్లీ ఇతర సెలబ్రిటీతో యాడ్ షూటింగ్‌లో పాల్గొనకూడదు. 
 
ఈ నిబంధన మేరకు దీపికాతో ఓ యాడ్‌లో నటించేందుకు కోహ్లీ నిరాకరించాడు. గోఐబిబోకు దీపికా పదుకునే ఇప్పటికే యాడ్స్ చేస్తున్న తరుణంలో దీపికాతో నటించాల్సిందిగా గోఐబిబో తెలిపింది. కానీ కాంట్రాక్టు ప్రకారం మరో సెలెబ్రిటీతో నటించకూడదు. ఫలితంగా కోహ్లీ నో చెప్పడంతో గోఐబిబో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు అయ్యింది. 
 
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల నిషేధానికి తర్వాత ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో బరిలో దిగనుంది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దేశవాళీ ఆటగాళ్లు పాల్గొన్నారు. విదేశీ ఆటగాళ్లు ఆయా దేశాల టోర్నీలు ముగియగానే జట్టుతో చేరుతారు. ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రాక్టీస్ కు ధోనీతో పాటు జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌమ్యజిత్‌ ఘోష్‌పై రేప్ ఆరోపణలు... కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి తొలగింపు?