Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండోర్ మూడో టెస్టు.. పుజారా అదుర్స్.. రెండోసారి డిక్లేర్ చేసిన భారత్

ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి,

ఇండోర్ మూడో టెస్టు.. పుజారా అదుర్స్.. రెండోసారి డిక్లేర్ చేసిన భారత్
, మంగళవారం, 11 అక్టోబరు 2016 (15:25 IST)
ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి, 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా 101(నాటౌట్) పరుగులతో సెంచరీతో అదర గొట్టాడు. 
 
అలాగే గంభీర్ మెరుగ్గా రాణించి హాఫ్ సెంచరీ సాధించాడు. విజయ్ 19, కోహ్లీ 17, రహానే 23(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ప్రత్యర్ధి జట్టు ముందు 475 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది కోహ్లీ సేన. సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 16 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. మరో 120 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్‌కు విజయం ఖాయమని క్రీడా పండితులు అంటున్నారు. 
 
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 557/5 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299/10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 216/3 డిక్లేర్డ్ చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కుల్లో పడిన సాక్షి ధోనీ.. 420 కేసు నమోదు.. కెప్టెన్ ధోనీ రూ.100 కోట్ల రికార్డు ఎలా?