Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెబ్బులిలా రెచ్చిపోయిన బంగ్లా.. తోకముడిచిన టీమిండియా

బెబ్బులిలా రెచ్చిపోయిన బంగ్లా.. తోకముడిచిన టీమిండియా
, సోమవారం, 4 నవంబరు 2019 (08:54 IST)
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బెబ్బులిలా రెచ్చిపోయింది. ఫలితంగా యువ రక్తంతో కూడిన టీమిండియా క్రికెట్ జట్టు తోకముడిచింది. దీంతో ట్వంటీ20 క్రికెట్‌లో బంగ్లా చేతిలో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. 
 
ఇరు క్రికెట్ జట్ల మధ్య మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆదివారం ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది. తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. షకీబల్, తమీమ్ ల గైర్హాజరీతో బలహీనపడిందనుకున్న బంగ్లాదేశ్ జట్టు అనూహ్యరీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేయగా, మరో మూడు బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ విజయతీరాలకు చేరింది. ఆ జట్టులో వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 
 
అలాగే, లిటన్ దాస్-7, మొహమ్మద్ నయీం-26, సర్కార్-39 పరుగులు చేసి ఔటవ్వగా ముస్తఫిజుర్ రహీం- 60, మహ్మదుల్లా-15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 20వ ఓవర్లో మూడో బంతికి తాత్కాలిక సారథి మహ్మదుల్లా సిక్స్ కొట్టడంతో బంగ్లా విజయం సాధించింది. 
 
లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో డీఎల్ చాహర్, అహ్మద్, చావల్‌కు తలో వికెట్ పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్ కొనసాగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు భారత్ - బంగ్లా తొలి ట్వంటీ20 మ్యాచ్ .. కుర్రాళ్ళకు ఛాన్స్