Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెల్‌బోర్న్‌లో చాహెల్ మాయాజాలం : ఆసీస్ 230 ఆలౌట్.. భారత్ లక్ష్యం 231

Advertiesment
మెల్‌బోర్న్‌లో చాహెల్ మాయాజాలం : ఆసీస్ 230 ఆలౌట్.. భారత్ లక్ష్యం 231
, శుక్రవారం, 18 జనవరి 2019 (12:11 IST)
భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఓవర్ల కోటా ముగియకముందే ఆలౌట్ అయింది. అంటే 48.4 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 230 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ చాహెల్ మాయాజాలంముందు కంగారులు బెంబేలెత్తిపోయారు. దీంత భారత్ ముంగిట 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచినట్టయింది. 
 
ఈ మ్యాచ్‌కు తొలుత వరుణదేవుడు ఆటంకం కలిగించాడు. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేక పోయారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో కారీ 5, ఫించ్ 14, ఖవాజా 34, మార్ష్ 39, కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్‌వెల్ 26, రిచర్డ్‌సన్ 16, జంపా 8 చొప్పున పరుగులు చేశారు. స్టాన్ లేక్ డకౌట్ కాగా, సిడిల్ పది పరుగులు చేశారు. ముఖ్యంగా, భారత స్పిన్నర్ చాహెల్ విజృంభించి ఏకంగా 6 వికెట్లు తీశాడు. భువనేశ్వర్, షమీలు రెండేసి వికెట్లు తీశారు. 
 
ముఖ్యంగా, వైఎస్ చాహెల్ పది ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు. 4.20 సగటుతో 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా చాహెల్ రికార్డు సృష్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలితో 'నిన్ను కూడా...' అంటున్న క్రికెటర్ పంత్... ఆమె ఏమన్నదో తెలుసా?