Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాంచీ తొలి టీ-20: కోహ్లీ బుల్లెట్ థ్రో అదుర్స్.. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ఫీల్డింగ్‌‌తో అదరగొట్టాడు. తొలి ట్వంటీ-20 పోరులో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టగా, మిడ

రాంచీ తొలి టీ-20: కోహ్లీ బుల్లెట్ థ్రో అదుర్స్.. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
, ఆదివారం, 8 అక్టోబరు 2017 (15:55 IST)
రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన  ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ఫీల్డింగ్‌‌తో అదరగొట్టాడు. తొలి ట్వంటీ-20 పోరులో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టగా, మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ, చాలాదూరం నుంచి దాన్ని ఓ బుల్లెట్‌లా వికెట్లపైకి విసిరేయగా, అది డైరెక్టుగా వచ్చి వికెట్లను తాకి డాన్‌ను అవుట్ చేసింది. బంతికోసం వికెట్ల వెనుక చేతులు పెట్టి ఉన్న ధోనీ.. బంతి డైరక్టుగానే వికెట్లను తాకడంతో ఒక్క క్షణం అబ్బురపడిపోయాడు. ఆ వెంటనే సహచరుడిని అభినందించేందుకు ముందుకు కదిలాడు. 
 
బాల్ సూపర్‌గా వచ్చి వికెట్లను తాకిందని సైగ చేస్తూ ధోనీ కదిలిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు పడగా, డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం, తగ్గించిన ఓవర్లు, పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా అందుకుని విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ విసిరిన 'బుల్లెట్ థ్రో' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా, వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌ పొట్టి ఫార్మాట్‌లోనూ తన ఆధిపత్యాన్ని చూపింది. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి టీ-20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో తొమ్మిది వికెట్లతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిఫా అండర్-17 ప్రపంచకప్.. నీళ్ల బాటిళ్లు అందక.. టాయిలెట్ నీళ్లు తాగారు..