Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదో టెస్టులో అరుదైన ఫీట్: ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించారు..

ఇంగ్లండ్‍‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అరుదైన ఫీట్‌ను సాధించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ

Advertiesment
India v England
, సోమవారం, 19 డిశెంబరు 2016 (14:13 IST)
ఇంగ్లండ్‍‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అరుదైన ఫీట్‌ను సాధించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ శతకం నమోదు చేశాడు. తద్వారా ఈ సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించారు.
 
1978-79 సీజన్ తరువాత ఒక సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు వ్యక్తిగత సెంచరీలను నమోదు చేయడం ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్‌పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేసుకుని కొత్త ఫీట్‌ను అందుకున్నారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే.
 
ఇకపోతే.. ఈ మ్యాచ్‌‌‍లో నాయర్ సెంచరీని నమోదు చేయగా, కేఎల్ రాహుల్ కూడా శతకం సాధించాడు. అంతకుముందు మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్, పూజారాలు శతకాలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, ఈ సిరీస్ లో భారత జట్టు ఇప్పటివరకూ ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్‌లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్‌లు సెంచరీలు నమోదు చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌ : మెరిసిన గుర్జంత్, సిమ్రన్‌జిత్.. జగజ్జేతగా భారత