విదర్భ బ్యాట్స్మెన్ ఫజల్ జింబాబ్వే-వెస్టిండీస్లతో జరిగే ట్వంటీ-20, పరిమిత ఓవర్ల టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆదివారం ముంబైలో సమావేశమైన సెలెక్టర్లు 16 సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. 275 వన్డేలు, 68 ట్వంటీ-20లకు కెప్టెన్గా వ్యవహరించిన ధోనీ జింబాబ్వే పర్యటనకు సారథ్యం వహిస్తాడు. ఇక వెస్టిండీస్ పర్యటనకు మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వ పగ్గాలు చేపడతాడు.
ఇకపోతే.. జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటన జూన్లో ఉంటుంది. జింబాబ్వేతో మూడు వన్డేలు, 3 ట్వంటీ-20 మ్యాచ్లు.. వెస్టిండీస్తో నాలుగు టెస్టు మ్యాచ్లను భారత్ ఆడనుంది.
జింబాబ్వే పర్యటనకు భారత్ జట్టు : ధోని(కెప్టెన్), అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, ఫజల్, మనీష్పాండే, కరుణ్నాయర్, కులకర్ణి, రుషి ధావన్, అక్షర్పటేల్, జయంత్ యాదవ్, బుమ్రా, బరిందర్, మన్దీప్, కేదార్ జాదవ్, ఉనద్కత్, చాహల్
వెస్టిండీస్ పర్యటనకు భారత్ జట్టు : కోహ్లి(కెప్టెన్), విజయ్, ధావన్, కేఎల్ రాహుల్, పుజారా, రహానె, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, ఎస్. ఠాకూర్, బిన్నీ.