Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి టెస్ట్ మ్యాచ్ : పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్

cricket balls
, గురువారం, 15 డిశెంబరు 2022 (15:24 IST)
ఆతిథ్య బంగ్లాదేశ్‌తో ఛట్టోగ్రామ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకునిపోయింది. కేవలం 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ సిరాజ్ మూడు వికెట్లు నేలకూల్చి బంగ్లాదేశ్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఫలితంగా 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 
 
బంగ్లా ఓపెనర్లు శాంటో డకౌట్ కాగా, జకీర్ హుస్సేన్ 20, కెప్టెన్  లిట్టన్ దాస్ 4 చొప్పున పరుగులు చేశాడు. ఈ మూడు వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. మరో ఎండ్‌లో ఉమేశ్ ఓ వికెట్ తీశాడు. దీంతో భారత శిబిరంలో ఆనందం నింపాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు బంగ్లాదేశ్ ఇంకా 333 పరుగుల దూరంలో ఉంది. 
 
అంతకుముందు భారత్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 22, గిల్ 20, పుజారా 90, కోహ్లీ 1, రిషబ్ పంత్ 46, శ్రేయాస్ అయ్యర్ 86, అక్సర్ పటేల్ 14, అశ్విన్ 58, కుల్దీప్ యాదవ్ 40, ఉమేశ్ యాదవ్ 15 (నాటౌట్), సిరాజ్ 4 చొప్పున పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, మిరాజ్‌లు చెరో నాలుగు వికెట్లు తీయగా, హుస్సే్, అహ్మద్ చెరో వికెట్ తీశారు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంచలన నిర్ణయం తీసుకున్న కేన్ విలియమ్సన్