ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్తో ఉత్కంఠ భరితంగా సాగింది.ఆదివారం పాకిస్థాన్తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో టీమిండియా 9వ ఆసియా కప్ టైటిల్ను ముద్దాడింది.
పాకిస్థాన్కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో భారత్తో జరిగిన మూడు మ్యాచ్లకు మూడు ఓటమిపాలైంది. ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా.. ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడైన మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని చెబుతూ..ఫైనల్ వేడుకను బహిష్కరించింది.
ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకుంది. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ను అభిషేక్ శర్మ అందుకున్నారు. ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఫైనల్ వేడుక వేదికపై ఉండి ట్రోఫీ చేతిల్లో ఉన్నట్లు ఊహించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ట్రోఫీ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు.