Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌కు టీ20 ఫీవర్ - నేడు ఉప్పల్‌లో మ్యాచ్

IndvsAus
, ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:22 IST)
హైదరాబాద్ నగరానికి టీ20 ఫీవర్ పట్టుకుంది. ఆదివారం రాత్రి స్థానిక ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లూ శనివారం రాత్రే హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో సిరీస్ ఫలితాన్న నిర్ధేసించే ఉప్పల్ మ్యాచ్ ఇపుడు హోరాహోరీగా సాగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ స్టేడియంలో చివరిగా సారిగా గత 2019 డిసెంబరుఆరో తేదీన చివరి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. భారత్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 94 (నాటౌట్‌) విజృంభించడంతో టీమ్‌ఇండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 209 రన్స్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగిన కోహ్లీ.. కాట్రెల్‌ బౌలింగ్‌ సిక్సర్‌ కొట్టిన అనంతరం పెవిలియన్‌ వైపు చూస్తూ టిక్కు కొట్టిన సందర్భం అభిమానుల మదిలో ఇంకా తాజాగానే ఉంది. 
 
తుది జట్ల అంచనా.. 
భారత్ : రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పాండ్యా, కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌/ అశ్విన్‌. 
 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇంగ్లిస్‌, డావిడ్‌, వేడ్‌, కమిన్స్‌, ఎలీస్‌, జంపా, హజిల్‌వుడ్‌.
 
పిచ్‌, వాతావరణం పిచ్‌పై పచ్చిక లేదు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాదల్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతం అయిన ఫెదరర్