Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్‌కు విజయం

pakistan tem
, ఆదివారం, 30 అక్టోబరు 2022 (16:04 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆ జట్టులో కోలిన్ అక్రిమె్ 27, స్కాట్ ఎడ్వర్డ్స్ 15 మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 92 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన పాకిస్థాన్ జట్టు 13.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ రిజ్వాన్ (49), జమాన్ (20), మసూద్ (12)లు రాణించారు. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, మీకెరెన్ ఒక వికెట్ చొప్పున తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్వంటీ20 టోర్నీలో సెమీస్‌కు చేరడం గగనమే : రోజర్ బిన్నీ