Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోచ్ భాస్కర్ పిళ్లైతో గొడవ.. అసభ్య పదజాలంతో దూషించిన గంభీర్‌పై వేటు

టీమిండియా స్టార్ వెటరన్ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌లపై నిషేధం విధించారు. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ రంజీ కోచ్ కేపీ భాస్కర్‌పై అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడంతోపాటు ఘర్షణ పడినందుకుగాను గంభీర్‌పై వ

కోచ్ భాస్కర్ పిళ్లైతో గొడవ.. అసభ్య పదజాలంతో దూషించిన గంభీర్‌పై వేటు
, ఆదివారం, 18 జూన్ 2017 (11:36 IST)
టీమిండియా స్టార్ వెటరన్ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌లపై నిషేధం విధించారు. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ రంజీ కోచ్ కేపీ భాస్కర్‌పై అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడంతోపాటు ఘర్షణ పడినందుకుగాను గంభీర్‌పై వేటు వేశారు. దీంతో గంభీర్ నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. 
 
డీడీసీఏ జట్టు ఒడిశాలో ఉన్నప్పుడు జట్టు కోచ్ భాస్కర్ పిళ్లైతో గంభీర్ గొడవ పడడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. పిళ్లై ఫిర్యాదు మేరకు డీజీసీఏ ఓ కమిటీని నియమించింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నియమించిన కమిటీ గంభీర్‌ను దోషిగా తేల్చింది. 
 
విచారణ అనంతరం కమిటీ చేసిన సూచన మేరకు గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించారు. మార్చి 30, 2019వరకు గంభీర్‌పై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ కాలంలో నాలుగు మ్యాచ్‌లు అతడు ఆడడానికి వీల్లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ పేసర్ల నుంచి భారత్‌ బ్యాట్స్‌మెన్‌కు వచ్చిన ముప్పేమీ లేదు: గంభీర్