Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ : సీటు కోసం కొట్టుకున్న ఫ్యాన్స్

fans fight
, ఆదివారం, 22 అక్టోబరు 2023 (09:59 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు ఈ నెల 5వ తేదీన ప్రారంభంకాగా, ఇప్పటివరకు సాఫీగానే సాగిపోతున్నాయి. అయితే, స్టేడియాల్లో మాత్రం క్రికెట్ అభిమానులు చిన్నపాటి కోపతాపాలకు లోనవుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది. నిజానికి క్రికెట్ అంటే అభిమానుల భావోద్వేగం కాబట్టి వారి ఎమోషన్స్ పీక్స్‌లోనే ఉంటాయి. దీంతో వారు చిన్నచిన్న విషయాలకే నిగ్రహం కోల్పోయి గోడవపడుతుంటారు. దీంతో స్టేడియాల్లో చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. 
 
ఇటీవల బెంగళురులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఓ సీటు గురించి ఇద్దరు ప్రేక్షకుల మధ్య గొడవ తాలూకు వీడియో వైరల్‌గా మారింది. తొలుత ఆ ఇద్దరు ప్రేక్షకులు మాటామాట అనుకుని ఆ తర్వాత ఒకరినొకరు తోసుకుని కిందపడిపోయారు. ఈ వివాదం మరింత ముదిరేలోపే అక్కడున్న వారు ఇతర అభిమానులు ఇద్దరినీ వారించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌పై 62 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మార్ష్, వార్నర్ అద్భుత శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ ఏకంగా 259 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా విజయానికి గట్టిపునాది వేశారు. అదేసమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు కీలక క్యాచ్‌లను వదిలిపేయడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ ప్రపంచ కప్‌లో అసలు సిసలైన సవాల్... భారత్ వర్సెస్ కివీస్ పోరు