Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత క్రికెట్ జట్టు బౌలర్‌పై దాడి.. ఎక్కడ?

భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న మహ్మద్ షమీపై దాడి జరిగింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అతని నివాసం వద్దే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి శనివారం సాయంత్రం జరిగింది.

Advertiesment
Mohammed Shami
, మంగళవారం, 18 జులై 2017 (18:00 IST)
భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న మహ్మద్ షమీపై దాడి జరిగింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అతని నివాసం వద్దే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి శనివారం సాయంత్రం జరిగింది. 
 
ష‌మి త‌న కారులో ఇంటికి వ‌చ్చిన స‌మ‌యంలో.. వాచ్‌మ‌న్ గేట్ ఓపెన్ చేసేవ‌ర‌కు రోడ్డుపై కారు ఆపాడు. ఆ స‌మ‌యంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు షమీతో రోడ్డుపై కారు ఎందుకు ఆపావంటూ వాగ్వాదానికి దిగి దాడులకు దిగారు. ఈ దాడిని అడ్డుకోవ‌డానికి వ‌చ్చిన వాచ్‌మ‌న్‌పై కూడా వారు చేయి చేసుకున్నారు. 
 
దీనిపై షమీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు... ఈ దాటి ఘటనంతా బిల్డింగ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. దీని ఆధారంగా జ‌యంత స‌ర్కార్‌, స్వ‌రూప్ స‌ర్కార్‌, శివ ప్రామానిక్ అనే ఆ ముగ్గురు యువ‌కులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ ద్రవిడ్ - జహీర్‌లకు షాకిచ్చిన రవిశాస్త్రి.. ఎలా?