Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్ చేతులమీదుగా.. సింధుకు రూ.60 లక్షల బీఎండబ్ల్యూ కారు..!

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖరారు చేసిన భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధుకు ఖరీదైన కానుకలు అందనున్నాయి. గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సె

సచిన్ చేతులమీదుగా.. సింధుకు రూ.60 లక్షల బీఎండబ్ల్యూ కారు..!
, శుక్రవారం, 19 ఆగస్టు 2016 (09:25 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖరారు చేసిన భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధుకు ఖరీదైన కానుకలు అందనున్నాయి. గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సత్తా చాటిన సింధు.. తన ప్రత్యర్థిపై విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు ధీటుగా రాణించి పతకం కైవసం చేసుకుంటే.. ఆమెకు ప్రశంసలతో పాటు కానుకల వర్షం కురిపించేందుకు స్పాన్సర్లు రెఢీ అవుతున్నారు.
 
ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించిన వెంటనే అక్కడే ఉన్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వరీనాథ్ ఆమెకు ఖరీదైన గిప్ట్‌ను ప్రకటించారు. ఇండియాకి మరో పతకం ఖరారు చేసిన సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు చాముండి ప్రకటించారు. 
 
రియో ఒలింపిక్స్ నుంచి ఈ నెల 28న సింధు హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పిన చాముండి... తర్వాతి రోజే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ కారును సింధుకు అందజేయనున్నట్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఒక్క మ్యాచ్‌... ఒక ఒకే ఒక్క మ్యాచ్... ఇప్పుడు... నా టార్గెట్‌ గోల్డ్‌ : పీవీ సింధు