Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఒక్క మ్యాచ్‌... ఒక ఒకే ఒక్క మ్యాచ్... ఇప్పుడు... నా టార్గెట్‌ గోల్డ్‌ : పీవీ సింధు

రియో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరిన తెలుగమ్మాయి పీవీ సింధు బంగారు పతకంపైనే గురి పెట్టినట్టు వెల్లడించింది. గురువారం రాత్రి సెమీస్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ఆమె

'ఒక్క మ్యాచ్‌... ఒక ఒకే ఒక్క మ్యాచ్... ఇప్పుడు... నా టార్గెట్‌ గోల్డ్‌ : పీవీ సింధు
, శుక్రవారం, 19 ఆగస్టు 2016 (08:51 IST)
రియో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరిన తెలుగమ్మాయి పీవీ సింధు బంగారు పతకంపైనే గురి పెట్టినట్టు వెల్లడించింది. గురువారం రాత్రి సెమీస్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ఆమె మాట్లాడుతూ... 'నెక్ట్స్‌ మ్యాచ్‌ గెలవాలి'... ప్రతి మ్యాచ్‌ తర్వాత ఇదే నా టార్గెట్‌. ఇక్కడిదాకా వస్తాననుకోలేదు. ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ వచ్చాను. ఇక.. ఒక్క మ్యాచ్‌... ఒక ఒకే ఒక్క మ్యాచ్‌! ఇప్పుడు... నా టార్గెట్‌ గోల్డ్‌ మెడల్‌ అని చెప్పుకొచ్చింది.
 
ఈ మ్యాచ్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడతా! నా సత్తా మొత్తం చూపిస్తా! విజయావకాశాలు ఖచ్చితంగా నావైపే ఉన్నాయనే నమ్మకముంది. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఫైనల్స్‌ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా. అయితే, అది అంత సులభమని నేను అనుకోవడం లేదు. కరోలినా మారిన్‌ నిజంగా బలమైన ప్రత్యర్థి. ఆమె బాగా ఆడుతోంది. అయితే... ఫైనల్స్‌లో ఎవరు బాగా ఆడతారన్నదే విజయాన్ని నిర్దేశిస్తుంది. తన కోచ్ పుల్లెల గోపీచంద్ చెప్పిన వ్యూహాలను ఫైనల్ మ్యాచ్‌లో అనుసరిస్తానంటూ సింధు వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శెభాష్ సింధు... ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి... నేడు బంగారు పతక వేట