Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనిల్ కుంబ్లే ఫైన్ కలెక్టింగ్ కమిటీ: ఛైర్మన్‌గా ఎంపికైన భువనేశ్వర్!

క్రికెటర్లు ఎవరైనా బస్సును అందుకోవడంలో ఆలస్యమైతే రూ. 3,300 జరిమానా రూపంలో చెల్లించాలని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ జరిమానా విధింపు, డబ్బులు రాబట్టడం,

Advertiesment
Anil Kumble forms 'fine-collecting' committee with Bhuvneshwar Kumar as chairman
, ఆదివారం, 17 జులై 2016 (16:58 IST)
క్రికెటర్లు ఎవరైనా బస్సును అందుకోవడంలో ఆలస్యమైతే రూ. 3,300 జరిమానా రూపంలో చెల్లించాలని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ జరిమానా విధింపు, డబ్బులు రాబట్టడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం టీమిండియా ఆటగాళ్లతోనే ఓ కమిటీని కుంబ్లే ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఏర్పాటయ్యే కమిటీకి ఛైర్మన్‌గా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను నియమించాడు.
 
అలాగే డబ్బులను రాబట్టే బాధ్యత పుజారాకి అప్పగించారు. జరిమానాకి సంబంధించిన ఫిర్యాదులను శిఖర్‌ ధావన్‌ చూస్తాడని అనిల్ కుంబ్లే తెలిపాడు. భారత క్రికెటర్ల క్రమశిక్షణపై మరింత శ్రద్ధ తీసుకోవడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కుంబ్లే చెప్పాడు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. నాలుగు టెస్టు సిరీస్‌ల కోసం భారత్ వెస్టిండీస్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. జరిమానా విధానం ఇప్పటికే అమలులోకి వచ్చినా.. ఆటగాళ్లు ఎవరూ క్రమశిక్షణ తప్పలేదని భువనేశ్వర్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగడం డౌటేనా? డోపింగ్ ఏజెన్సీ ఏమంటోంది?!