Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్‌తో బెట్టింగ్‌లు.. బుకీలు ఎస్కేప్.. దొంగలుగా మారుతున్న యువత!!

Advertiesment
IPL cricket betting
, బుధవారం, 25 మే 2016 (15:04 IST)
క్రికెట్ క్రీడతో పాటు బెట్టింగ్ బాగా పెరిగిపోతోంది. ట్వంటీ-20, ప్రపంచకప్, ఐపీఎల్.. ఇలా ఏది జరిగినా బెట్టింగ్‌ మాత్రం ఎక్కడపడితే అక్కడ జరిగిపోతోంది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ భూతం దిష్ట వేసుకుని కూర్చుంది. దీని ప్రకారం ఐపీఎల్ పందేలు కేవలం ధనార్జన కోసమే నిర్వహించబడుతున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాకుండా ప్రతీ మ్యాచ్‌పై బెట్టింగ్ జరుగుతుందని తెలిసింది. 
 
ఇక ఐపీఎల్‌ పందేలు కేవలం జట్ల జయాపజయాలపై మాత్రమే సాగుతున్నాయి. అయితే మూడు నెలల్లోనే జంటపోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 1000 మందిని అరెస్టు చేశారు. 100కు పైగా కేసులు నమోదుచేశారు. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 
ప్రధాన బుకీలంతా ముంబయ్‌, ఢిల్లీ, కోల్‌కతా, పుణేలలో ఉంటూ కాసుల ఎర వేస్తుంటారు. సీనియర్‌ ఏజెంట్లనే బుకీలుగా మార్చి.. లక్షకు 10-20 వేల వరకూ కమీషన్ల రూపంలో చెల్లిస్తున్నారు. పందేల కోసం యువత దొంగలుగా మారిపోతున్నారని.. క్రికెట్ బెట్టింగ్ సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్ గేల్‌కు తొలి షాక్: బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టు రద్దు.. ఇంగ్లీష్ కౌంటీల్లోనూ..?!