హెడింగ్లీలో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో రిషబ్ పంత్ భారత తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా నిలిచాడు. పంత్ తన ఖాతాలో ఏడవ టెస్ట్ సెంచరీని, ఇంగ్లాండ్పై తన నాలుగో సెంచరీని సాధించడంతో ఈ మైలురాయిని సాధించాడు.
ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో పంత్ సిక్సర్ కొట్టి తన సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత పంత్ గ్రౌండ్పై సోమర్సాల్ట్ వేయడం అభిమానులను, సహచరులను అలరించింది. ఇది పంత్కు ఇంగ్లాండ్ గడ్డపై మూడవ టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
99 పరుగులతో ఉన్న సమయంలో సిక్సర్తో రిషబ్ పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 146 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 71.92 స్ట్రైక్ రేటుతో తన సెంచరీని సాధించాడు. మొత్తంగా 134 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఇంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. అతను ఇప్పటి వరకు 56 సిక్సర్లు కొట్టి భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే, లీడ్స్ మ్యాచ్లో పంత్ 58వ సిక్సును కొట్టి ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రను పరిశీలిస్తే, మొత్తం ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాప్లో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 83 సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత వికెట్ కీపర్లు-అత్యధిక సెంచరీలు
రిషభ్ పంత్ - 7 సెంచరీలు
ఎంఎస్ ధోని- 6 సెంచరీలు
వృద్ధిమాన్ సాహా- 3 సెంచరీలు