Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో కరోనా పంజా : నిండిపోతున్న ఐసీయూ వార్డులు

అమెరికాలో కరోనా పంజా : నిండిపోతున్న ఐసీయూ వార్డులు
, మంగళవారం, 23 నవంబరు 2021 (16:15 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా పంజా విసిరింది. ప్రతి రోజూ వందలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూ పడకలు నిండిపోతున్నాయి. దీంతో అమెరికా వాసుల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
గత యేడాదితో పోల్చితో 15 రాష్ట్రాల్లో ఇపుడు ఐసీయు పడకలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఆరోగ్య మానవ సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిన్నసొట్టా, కొలరాడో, మిచిగన్‌లలో 37, 41, 34 శాతం మేరకు ఐసీయు పడకలు నిండుకున్నట్టు ఆ దేశ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా దాదాపుగా వెయ్యి వరకు ఉంది. గత మూడు నెలలుగా ఇదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుంటే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్టేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. న్యూజెర్సీలో ఐసీయూలో చేరే వారి సంఖ్య ఒక్కసారిగా 24 శాతం మేరకు పెరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంటల్లో చిక్కుకున్న బల్గేరియా బస్సు-45మంది సజీవదహనం