Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు-ఆరుగురు మృతి

corona visus
, గురువారం, 28 డిశెంబరు 2023 (13:18 IST)
గత 24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా రోగుల సంఖ్య 4,097 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఆరుగురు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఆరు మరణాలు సంభవించాయి, అందులో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు మరణించారు.
 
డిసెంబర్ 22న దేశంలో 752 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. చలి కారణంగా కొత్త రూపంలో కరోనా వైరస్ కారణంగా, ఇటీవలి రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. అంతకుముందు డిసెంబర్ 5 నాటికి రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు తగ్గింది.
 
 
మరోవైపు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ గురువార ఏపీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోవిడ్-19- JN.1 సబ్-వేరియంట్‌ను నియంత్రించడానికి మరింత స్క్రీనింగ్ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనీలాండరింగ్ కేసు... ప్రియాంకా గాంధీ పేరు ప్రస్తావన