Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాటు వేసిన కరోనావైరస్, 20 రోజుల్లోనే చంపేసింది

Advertiesment
Maharastra
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (21:27 IST)
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రావ్ సాహెబ్‌ను కరోనావైరస్ కాటు వేసిది. దీనితో ఆయన గత 20 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. కానీ శనివారం నాడు పరిస్థితి ఆందోళనకరంగా మారి కన్నుమూశారు.
 
మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలోని దెగ్లూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత నెల మార్చి 19వ తేదీన దగ్గు, జలుబు తీవ్రంగా వుండటంతో పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. వెంటనే సమీపంలో ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
 
కానీ ఏప్రిల్ 1వ తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయనకు కోవిడ్ నెగటివ్ అని వచ్చింది. కానీ ఆయన అవయవాలు పనితీరు దెబ్బతిన్నది. దీనితో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయనను వెంటిలేటర్ పైన వుంచి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ శనివారం నాడు ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యపై అనుమానం.. కత్తితో 25 సార్లు పొడిచి చంపేశాడు..