Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చలికాలం.. కరోనా అలెర్ట్.. దేశంలో కఠిన చర్యలు

corona visus
, బుధవారం, 21 డిశెంబరు 2022 (09:21 IST)
చలికాలం కావడంతో భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం సంప్రదింపులు జరపనుంది. 
 
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో, జపాన్, అమెరికా, చైనా, కొరియా, బ్రెజిల్‌తో సహా దేశాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిందని గుర్తు చేశారు. కరోనా బారిన పడిన వ్యక్తుల నమూనాలను జన్యు ప్రయోగశాలలకు పంపే పనిని ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. దీని ద్వారా కరోనా రకాలను గుర్తించవచ్చని తెలిపింది. 
 
ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ధృవీకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు చురుకుగా నిర్వహించాలని సూచించారు. మరోవైపు ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా సీనియర్‌ అధికారులు, నిపుణులతో బుధవారం సంప్రదింపులు జరుపనున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో వ్యక్తి జంప్