Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరిగిపోయిన కోవిషీల్డ్ డోసుల స్టాక్... 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి

Advertiesment
Government
, సోమవారం, 22 నవంబరు 2021 (12:34 IST)
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసుల స్టాక్ పెరిగిపోయిన నేపథ్యంలో భారత ఫార్మ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 50 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను నాలుగు దేశాలకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. 
 
ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని కోవ్యాక్స్‌ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, తజికిస్తాన్‌, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి మంజూరు చేయాలని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనిలో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్ నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌, బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నట్లు తెలిపాయి.
 
పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)లోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవల తెలిపింది. వాటిని వేగంగా పంపిణీ చేయకుంటే మా కంపెనీకి శీతల గిడ్డంగులు, మానవ వనరుల పరమైన అవాంతరాలు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. అందుకే ఎగుమతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పఠాన్ కోట్‌లోని ఆర్మీ క్యాంపులో గ్రనేడ్ పేలుడు