Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిషీల్డ్ 50 లక్షల డోసులు పంపిణీ

Advertiesment
కోవిషీల్డ్ 50 లక్షల డోసులు పంపిణీ
, సోమవారం, 22 నవంబరు 2021 (11:45 IST)
నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌లకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి.

 
ఈ మూడు దేశాలతో పాటు, కోవిషీల్డ్‌ను బంగ్లాదేశ్‌కు కూడా ఎగుమతి చేస్తుందని వారు తెలిపారు. నవంబర్ 23 నుండి కోవాక్స్ ప్రోగ్రామ్ కింద కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభిస్తుంది. నేపాల్ మొదటి కోవిషీల్డ్‌ను అందుకుంటుంది. 

 
పుణెకు చెందిన సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లోని ప్రభుత్వ- నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవలి కమ్యూనికేషన్‌లో తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప, తిరుపతిలో చంద్రబాబు పర్యటన..