Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంపై మరో కొత్త వైరస్ డిసీజ్‌ ఎక్స్‌ అటాక్.. కరోనా కంటే డేంజరస్.. ?

Advertiesment
Corona
, శనివారం, 2 జులై 2022 (14:25 IST)
Corona
ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందని తెలుస్తోంది. అది కరోనా కంటే భయంకరమైంది. దీనిపేరు డిసీజ్‌ ఎక్స్‌ అనిహెచ్చరిస్తున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు.
 
మూడేళ్ల క్రితం ప్రపంచంపై దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకముందే మరో కొత్త వ్యాధి పొంచి ఉందని హెచ్చరికలు మొదలయ్యాయి. 
 
కరోనాలో రకరకాల వేరియంట్లకు తోడు కొంత కాలంగా మంకీపాక్స్‌ పలు దేశాలను వణికిస్తోంది. ఇదే సీరిస్‌లో మరో మహమ్మారి ఎటాక్‌ చేసే అవకాశం ఉందంటున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు. దీనికి 'డిసీజ్‌ 'ఎక్స్‌' అనే పేరుకూడా పెట్టేశారు. కరోనాకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
 
'డిసీజ్‌ 'ఎక్స్‌' అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధే అయినా, ఇది ప్రపంచం మీద సృష్టిచే విధ్వంసం ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజులో మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కరోనాకన్నా తీవ్రమైన కొత్త వ్యాధులు వస్తాయని చెబుతున్నారు ప్రాఫెసర్‌ జీన్‌జాక్యూస్‌ ముయేంబే టామ్‌ఫమ్‌.. 1976లో ఎబోలా ను కనుక్కోవడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా టెన్షన్: ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలకు పాజిటివ్