Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కోవిడ్ కొత్త కేసులు 7,992: 24 గంటల్లో 393 మంది మృతి

Advertiesment
Covid
, శనివారం, 11 డిశెంబరు 2021 (13:24 IST)
కోవిడ్ కోరలు చాస్తూనే వుంది. దేశంలో 7,992 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 393 మరణాలు నమోదయ్యాయి.


దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,682,736కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 4,75,128కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాలు చెపుతున్నాయి. దేశంలో ఈరోజు 9,265 రికవరీలు నమోదయ్యాయి.

 
యాక్టివ్ కోవిడ్-19 కేసులు 24 గంటల వ్యవధిలో 1,666 మేర తగ్గుదల నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 93,277 వద్ద ఉంది. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.36 శాతంగా నమోదైంది. ఇది గత ఏడాది మార్చి నుండి అత్యధికం.

 
రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదు చేయబడింది. గత 68 రోజులుగా ఇది రెండు శాతం కంటే తక్కువగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెడ్డీ గ్యాంగ్ కోసం సెర్చ్ ఆప‌రేష‌న్... రైల్వే ట్రాక్ వ‌ద్దే ఉంటార‌ట‌!