Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..

Covid test
, మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:05 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు సంఖ్య గణనీయంగా తగ్గింది. గత రెండు రోజుల క్రితం పది వేల వరకు నమోదైన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులుగా బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1,89,087 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 6,660 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే దేశంలో కరోనా వైరస్ బారినపడిన కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 63,380 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటివరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాతపడ్డారు. వీరితో కలుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,31,369కి చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ కొత్త సచివాలయ భవనం ముస్తాబు.. ఏప్రిల్ 30న ప్రారంభం