Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Advertiesment
corona virus

ఠాగూర్

, ఆదివారం, 1 జూన్ 2025 (22:45 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. భారత్‌లో కూడా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. జూన్ ఒకటో తేదీ ఉదయానికి దేశవ్యాప్తంగా 3758 కేసులు నమోదైవున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ హెచ్చరిక చేసింది. 
 
ప్రస్తుతం వ్యాప్తితో ఉన్న ఎల్‌ఎఫ్ 7, ఎన్.బి. 1.8.1 సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా వర్గీకరించినట్టు పేర్కొంది. పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎన్.బి.1.8.1 వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్లు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఏకకాలంలో పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 
 
ఇప్పటికే ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ లక్షణాలను, ప్రభావాన్ని తగ్గించడంలో సమర్ధవంతంగా పని చేస్తాయని భావిస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరోవైపు, తాజా గణాంకాల మేరకు అత్యధికంగా కేరళలో 1400 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో 485, ఢిల్లీ 436, గుజరాత్ 320, వెస్ట్ బెంగాల్ 287, కర్నాటక 238 రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్త ఏపీలో 23 క్రియాశీలక కేసులు ఉండగా, తెలంగాణలో 3 కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం