Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగో వేవ్‌ ముప్పు తప్పదు.. డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

నాలుగో వేవ్‌ ముప్పు తప్పదు.. డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్
, శనివారం, 2 ఏప్రియల్ 2022 (14:56 IST)
కరోనాతో నాలుగో వేవ్‌ ముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. కరోనా మ్యుటెంట్ ‘ఎక్స్ఈ’కి మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. 
 
కరోనా ఒమిక్రాన్‌లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్‌గా పరిగణిస్తున్నారు. కానీ, దీంతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించే లక్షణం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
 
ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగుచూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్‌లో గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. రేవంత్-జగ్గారెడ్డి వర్గీయుల ఫైట్