Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. రికార్డు స్థాయిలో 66,999 కేసులు

Advertiesment
Coronavirus
భారత్‌లో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకీ కేసులు కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23 లక్షల 96 వేలు దాటింది. అలా మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,645 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక గడిచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 942 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 47,033కు చేరింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 56,383 కాగా ఈ ఇప్పటి దాకా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,95,982కు చేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్ టాక్‌‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్..?