Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

కరోనా మహమ్మారి గుప్పిట్లో భారత్.. 24 గంటల్లో 459మంది మృతి

Advertiesment
Coronavirus
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:23 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 459 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 11,25,681 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..72,330 మందికి పాజిటివ్‌గా తేలింది. అక్టోబర్ ప్రారంభంలో ఈ స్థాయి విజృంభణ కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,22,21,665కి చేరగా.. 1,62,927 మంది ప్రాణాలు కోల్పోయారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
రోజురోజుకూ క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 5,84,055 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 4.55 శాతానికి చేరింది. నిన్న 40,382 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1.14కోట్ల పైచిలుకు మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా..రికవరీ రేటు 94.11 శాతంగా ఉంది.
 
ఆదివారం, హోలీ సెలవుల కారణంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో కొత్త కేసులు తగ్గినట్లు కనిపించాయి. కానీ, మళ్లీ ఇప్పుడు కరోనా అసలు తీవ్రత కనిపిస్తోంది. మహమ్మారితో అతలాకుతలం అవుతోన్న మహారాష్ట్రలో.. తాజాగా 39,544 కొత్త కేసులు వెలుగుచూశాయి. 227 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో.. సుమారు సగం మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే వెలుగుచూడటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్తెక్కించే మాటలతో వలవువలకు చిత్తైన యువకుడు.. ఆపై సూసైడ్... ఎందుకు?