Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాచ‌కులు, బైరాగుల‌కు క‌రోనా వాక్సినేష‌న్!

Advertiesment
Corona vaccination
, గురువారం, 5 ఆగస్టు 2021 (14:30 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గోదావారి తీరంలో యాచ‌కులు, బైరాగులు ఎక్క‌వ‌గా సంచ‌రిస్తుంటారు. వీరికి ఎలాంటి ఆధార్ కార్డులు, ఆధారం లేని స్థితి. ఇలాంటి వారికి క‌రోనా వ్యాక్సిన్ వేయించే ప‌నిపెట్టుకుంది... రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి.
 
రాజమహేంద్రవరంలోని నిరాశ్రయులు, యాచకులు, సాధువులకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ఉచితంగా రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమీ జీవ కారుణ్య సంఘం వేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్. వైద్య అధికారిని విన్నూత్న ఇందులో పాల్గొన్నారు.

టీకే విశ్వేశ్వరరెడ్డి నిరాశ్రయులు, యాచకులు, సాధువులకు కోవిడ్ టీకాలు వేయించడం గొప్ప విశేషంగా కొనియాడారు. ఇప్పుడు వేయించుకున్న అనాధలకు యాచకులకు సాధువులకు రెండు నెలల పోయిన తరువాత రెండవ డోసు వ్యాక్సినేషన్ వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ లాయర్ మద్దూరి శివ సుబ్బారావు వ్యాక్సినేషన్ వేయించుకున్న అనాధలకు, యాచకులకు, సాధువులకు మాస్కులు పంచిపెట్టారు.
webdunia

గోదావరి ఒడ్డున నిరాశ్రయులు, యాచకులు, సాధువులను ఒక చోటకు చేర్చి కోవిడ్ వాక్సినేషన్ వేయించడం మానవతా విలువలకు అద్దం పట్టిందని అన్నారు. రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఏ విధమైన ఆధారం లేనివారికి  కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తే వ్యాప్తి జరగకుండా ఉంటుంది అని అన్నారు.

వ్యాక్సినేషన్ అనంతరం అంద‌రికీ గోదావరి పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ స్వ‌రూప రెడ్డి భోజనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 120 మందికి యాచకులకు ఉచిత వాక్సినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో లో కళాశాల ఎన్. ఎస్. పివో లు ప్రవీణ, ప్రసాద్, కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హారతి ఆరిపోయింది... కుంకుమ కిందపడింది.. అంతే ఆత్మహత్య