Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాల్లో ఈ రోజు కరోనా కేసులెన్ని?

Advertiesment
Corona Positive Cases
, ఆదివారం, 18 జులై 2021 (20:12 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా, ఏపీ కంటే తెలంగాణాలో ఈ కేసుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఆదివారం నాటి లెక్కల ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, 
 
ఏపీలో గడచిన 24 గంటల్లో 1,05,024 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,974 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 577 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 501, ప్రకాశం జిల్లాలో 349, కృష్ణా జిల్లాలో 311 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి.
 
అదేసమయంలో 3,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 17 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,40,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,02,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,708 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,132కి పెరిగింది.
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 578 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 731 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. 
 
రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,36,627కు పెరిగాయి. 6,23,044 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 9,824 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3,759కు చేరాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఆస్తులను ధ్వంసం చేయండి.. తాలిబన్లకు ఐఎస్ఐ సూచన