Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరిగించిన వెండిని తాగిన మాతాజీ.. ప్రాణాలు కోల్పోయినా..?

కరిగించిన వెండిని తాగిన మాతాజీ.. ప్రాణాలు కోల్పోయినా..?
, సోమవారం, 10 మే 2021 (13:30 IST)
కరోనా కాలంలో మూఢనమ్మకాలతో కన్నుమూసే వారి సంఖ్య కూడా కాస్త పెరుగుతుందనే చెప్పాలి. ఇటీవల ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదని నమ్మి ఓ టీచర్ తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇది మరువక ముందే.. అలాంటి దారుణం మరొకటి జరిగింది. కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదని నమ్మి.. కరిగించిన వెండిని తాగి ఓ మాతాజీ మరణించిన ఘటన అమెరికాలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. కొలరాడోకు చెందిన అమి కార్లసన్ (45) అనే మహిళ 'లవ్ హాస్ ఓన్' అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతోంది. శిష్యులందరూ ఆమెను ''మదర్‌ ఆఫ్‌ గాడ్‌'' అని పిలుస్తారు. కొద్ది రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది.
 
దీంతో కార్లసన్ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ కనిపించిన వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ఇంట్లో దాదాపు 10మంది వరకు శిష్యులున్నారు. కార్లసన్‌ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి, బాక్సులో పెట్టి ఉంది. దాని చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించి.. భజనలు, పూజలు చేస్తున్నారు. 
 
అది గమనించిన పోలీసులు వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకుని కార్లసన్ మృతదేమాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టంలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.
 
కార్లసన్ ఈ యేడాది మార్చిలోనే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. అంతేకాదు ఆమె ద్రవరూపంలో ఉన్న వెండిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చనిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా: కుంభమేళాలో పాల్గొన్న సాధువులు, సన్యాసులు ఇప్పుడు వైరస్ వ్యాప్తి, కోవిడ్ మరణాల గురించి ఏమంటున్నారు?