Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని దంపతులకు కరోనా

Advertiesment
AP Assembly
ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంతోపాటు ఆయన సతీమణి తమ్మినేని వాణిశ్రీ కరోనా బారినపడ్డారు. సీతారాం భార్యకు వారంరోజుల క్రితం కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో శ్రీకాకుళంలోని మెడికల్‌ కేర్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 
 
నాలుగు రోజుల తరువాత తమ్మినేనికి సైతం కోవిడ్‌ లక్షణాలు కనిపిండచడంతో ఆయన కూడా అదే దవాఖానలో చికిత్స నిమిత్తం చేశారు.
 
ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నామని ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని దవాఖాన వైద్యులు తెలిపారు. స్పీకర్‌ తమ్మినేనిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్‌లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 891మంది మృతి