Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా భయంతో మేడపై నుంచి దూకేశాడు, ప్రాణాలు కోల్పోయాడు

Advertiesment
కరోనా భయంతో మేడపై నుంచి దూకేశాడు, ప్రాణాలు కోల్పోయాడు
, శనివారం, 2 మే 2020 (20:50 IST)
కరోనా వైరస్ భయంతో మానసిక అందోళన చెందిన ఓ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామంతాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు విఎస్ అపార్టుమెంటులోని ప్లాట్ నెంబర్ ౩౦౩లో నివసించే వాసిరాజు కృష్ణ మూర్తి (60) కొద్ది కాలంగా గ్యాస్ సమస్యతో అవస్థ పడుతున్నాడు.
 
తరచూ ఆయాసం రావడంతో కరోనా సోకిందేమో అని ఆందోళన చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. 
 
అయినప్పటికీ ఆయన ఆందోళన చెందుతుండటంతో శనివారం గాంధీ అసుపత్రికి వెళదామని కుటుంబ సభ్యులు రెడీ అవుతున్న తరుణంలో అపార్టుమెంటు తన ప్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఉప్పల్ పొలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రి మార్చురీకి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలకు వినోదాన్ని పంచుతాం, అనుమతివ్వండి: మంత్రి తలసానికి విజ్ఞప్తి