Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 March 2025
webdunia

కరోనా వైరస్ కల్లోలం, ఏపీ రిలీఫ్ ఫండ్‌కు 4 ఏళ్ల బాలుడు విరాళం

Advertiesment
కరోనా వైరస్ కల్లోలం, ఏపీ రిలీఫ్ ఫండ్‌కు 4 ఏళ్ల బాలుడు విరాళం
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:05 IST)
కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం చూస్తూనే వున్నాం. ఈ వైరస్ ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే వున్నాయి. ఒకవైపు లాక్ డౌన్ మరోవైపు ప్రజల సంరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రభుత్వాల ఖజనా ఖాళీ అవుతోంది. దీనితో ఆయా ప్రభుత్వాలకు ప్రజలు, సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు.
 
తాజాగా ఆంధ్రప్రదేశ్, విజయవాడ నాలుగేళ్ల బాలుడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. నాలుగేళ్ల హేమంత్ తను పొదుపు చేసుకున్న రూ .1991తో సైకిల్ కొనాలనుకున్నాడు.

కానీ ఈ విపత్తు గురించి తెలుసుకున్న ఆ బాలుడు తను పొదుపు చేసుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపధ్యంలో అతడు తాడేపల్లిలోని వైయస్ఆర్సిపి కార్యాలయంలో ఈ డబ్బును రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు అందజేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ గారూ.. స్నేహంలో ప్రతీకారం ఉండదు.. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇస్తాం: రాహుల్