Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న జేఎన్ 1 కేసులు

jn1virus
, సోమవారం, 1 జనవరి 2024 (22:50 IST)
దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ 1 చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉనికిని చాటుకున్న కోవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్... ఇపుడు భారత్‌లోనూ విజృంభిస్తుంది. ఫలితంగా దేశంలో ఈ సబ్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 197కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు నమోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నమోదైవున్నాయి. 
 
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4394కు చేరింది. వీటిలో జేఎన్1 సబ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి. దేశంలో కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ జేఎన్1 యాక్టివ్ కేసుల సంఖ్య 197కి పెరిగాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఈ  కేసులు 83గా ఉన్నాయి. కాగా, తెలంగాణాలో జేఎన్ 1 కేసులు రెండు నమోదయ్యాయి. అయితే, ఈ జేఎన్ 1 సబ్ వేరియంట్‌‍తో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ సర్కారు 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్‌దారులకు జనవరి ఐదో తేదీలోపు వేతనాలు, పెన్షన్లు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులను కొన్ని రోజుల పాటు ఆపి అయినా సరే జనవరి 5వ తేదీలోపే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. 
 
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలపడంతో వారి రుణం తీర్చుకొనే దిశగా రేవంత్ సర్కారు అడుగులు. ఆ దిశగా ఈనెల వేయాల్సిన రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాల నిధులు ఆపి జనవరి 5 లోపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు జమ చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
గ్లోవ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన కార్మికులు 
 
మహారాష్ట్రంలోని ఛత్రపతి శంభాఝీ నగరంలో‌‍ ఆదివారం తెల్లవారు జామున్న గ్లోవ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకునిపోవడంతో వారు సజీవదహనమయ్యారు. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున 2.15 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
 
భవనంలో చిక్కుకున్న తమ బంధువులను రక్షించేందుకు సహాయం కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నట్లు ఆ ప్రాంతం నుంచి దృశ్యాలు చూపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారని ఫైర్ ఆఫీసర్ మోహన్ ముంగ్సే చెప్పారు.
 
రాత్రి కంపెనీ మూసి ఉందని, కంపెనీలో మంటలు చెలరేగాయని కార్మికులు చెప్పారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మంటలు చెలరేగినప్పుడు భవనం లోపల 10-15 మంది ఉన్నారని, కొందరు తప్పించుకోగలిగారు. మరికొందరు ఇంకా లోపల అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారని కార్మికులు తెలిపారు.
 
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కంపెనీలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రెగ్నెన్సీ చేస్తే రూ. 13 లక్షల ప్యాకేజీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.799, ఎక్కడ?