Publish Date: Thu, 03 Apr 2008 (11:38 IST)
Updated Date: Thu, 03 Apr 2008 (11:37 IST)
వండిన కూరలు, పచ్చివి ఏవైనా మిగిలిపోయాయని పారేయకండి వాటిని కలిపి చింతపండుపులుసు పోసి ఉప్పు, పసుపు, కారాలను వేసి పులుసులా పెట్టండి, కొత్త రకం పులుసు రెడీ అయిపోతుంది.
కొత్తి మీర కాడలతో సువాసనలు
కొత్తిమీర ఆకులను చారులో వేశారా ? అయితే వాటి కాడలను పారేయకండి. దానిని పులుసు లేక సాంబారులలో వేసి కావాలంటే తీసేయండి. సాంబార్ చాలా సువాసనగా ఉంటుంది.
సాంబార్ రుచి కోసం
సాంబార్ చేసేందుకు కందిపప్పును ఉడికిస్తున్నారా అయితే ఉడికించే సమయంలో ఇందులో కాసిని మెంతులను కూడా వేయండి రాత్రి వరకు పాడవకుండా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.