సరైన కొలతల ప్రకారంగానే మినప్పప్పు, రవ్వ నానబెట్టినా కూడా ఇడ్లీలు గట్టిగా వస్తున్నట్లయితే... మినప్పప్పు రుబ్బేటప్పుడు మూడుచెంచాల అటుకులు కూడా వేసి, ఈ పిండికి నానబెట్టిన రవ్వ కలపండి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు మృదువుగా రావడమే గాకుండా, తినేందుకు మంచి రుచిగా కూడా ఉంటాయి.