Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాయగూరలు వాడిపోయినట్లుంటే ఇలా చేస్తే తాజాగా వుంటాయి

కాయగూరలు వాడిపోయినట్లుంటే ఇలా చేస్తే తాజాగా వుంటాయి
, బుధవారం, 13 అక్టోబరు 2021 (22:37 IST)
వాడిపోయినట్లుండే కాయగూరలను ఉపయోగించే ముందు వాటిని నిమ్మరసం కలిపిన నీటిలో గంటసేపు ఉంచి తరువాత వాడితే తాజాగా మారుతాయి.
 
ఫ్రిజ్ లేని వారు.. గుడ్ల పై పొరమీద ఆవాలనూనె గానీ, వనస్పతి నూనెగానీ పూస్తే.. గుడ్లు చెడిపోకుండా తాజాగా ఉంటాయి.
 
కాసిన్ని పాలతోటే టీ రెడీ చేసిన తరువాత, అందులో కాసింత బిస్కెట్ పొడిని వేసి బాగా కలిపండి. తక్కువ పాలతో ఎక్కువ చిక్కటి టీ రెడీ అయినట్లే.
 
ఉల్లిపాయకు పొట్టును తీసి... ఉప్పు నీటిలో కొంచెం సేపు నానబెట్టిన తరువాత తిన్నట్లయితే నోరు వాసన రాకుండా ఉంటుంది.
 
ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఒక చాక్లెట్ కూడా తినటం మరీ మంచిది. ముఖ్యంగా గర్భిణీలకు చాలా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా కోసం గుడ్డులోని తెల్లసొనను తరచూ తింటూ ఉండాలి.
 
పన్నీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
 
ఫ్రిజ్‌లోంచి తీసిన పన్నీర్‌ను వండేందుకు ముందుగా కొద్దిసేపు వేడినీటిలో వేస్తే మృదువుగా మారుతుంది.
 
కాకర కాయల్ని కాయలుగానే ఉంచితే త్వరగా పండిపోతాయి. అలా కాకుండా వాటిని ముక్కలుగా కోసి ఉంచుకుంటే త్వరగా పండవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్పూరంతో లాభాలేంటో తెలుసా? (video)