Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే?

Advertiesment
Cookery tips
, మంగళవారం, 4 నవంబరు 2014 (18:58 IST)
కంది పప్పు త్వరగా ఉడకాలంటే, ఉడుకుతున్నప్పుడు నాలుగైదు బియ్యపు గింజలు వేయాలి. అలాగే కంది పప్పు ఉడుకుతున్నప్పుడు ఎక్కువ పొంగు వస్తున్నట్లయితే రెండు నూనె బొట్లు వేస్తే పొంగు తగ్గుతుంది.
 
అన్నం, పప్పు వండేటప్పుడు సరిగ్గా అవసరమైనంతవరకే నీటిని పోయండి. అర్జెంటుగా మీకు మజ్జిగ కావలసి వచ్చిందనుకోండి-దానికేం చేస్తారంటే-పాలు గోరు వెచ్చగా వెచ్చబెట్టి అందులో చిటికెడు ఉప్పు వేయండి. కొద్దిగా నిమ్మ పండు రసం కూడా పిండండి. కొద్ది సేపట్లోనే పాలు విరిగి మజ్జిగ అవుతుంది. 
 
అల్యూమినియం లేదా ఇనుప పెనం మీద దోసెలు వేస్తున్నప్పుడు అవి సరిగ్గా రాకుండా అంటుకుపోతుంటే పెనం సరిగ్గా వేడెక్కలేదేమో గమనించండి. సరిగ్గా వేడెక్కకపోతే దోసెలు దానికి అంటుకుపోతాయి. 
 
ఆలూ చిప్స్ ఇంట్లో చేసేటప్పుడు నల్లబడి పోకుండా ఉండాలంటే పలచని మస్లిన్ వస్త్రంలో కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి దాని ముక్కల్ని ఉడికించే నీటిలో ముంచి తీయాలి. ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి. ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే ఇడ్లీలు చాల మృదువుగా ఉంటాయి. 
 
ఇడ్లీ పిండిని టైటుగా మూత పెట్టిన ప్రెజర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది. ఇడ్లీ చప్పగా కాకుండ రుచిగా ఉంటాయి. ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి. ఉడికించే నీటిలో కొద్దిగా వంటనూనె వేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి. ఉల్లి పాయను అడ్డంగా కోసి దోసెల (అట్లు) పెనం మీద రాస్తే దోసెలు చక్కగా చెడకుండా వస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu