Publish Date: Thu, 08 Jan 2009 (20:19 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:44 IST)
కావలసిన పదార్థాలు :
బటన్ మష్రూమ్స్... పావుకేజీ
నెయ్యి... 50 గ్రాములు
పాలక్రీం... నాలుగు టీస్పూన్లు
మైదా... 50 గ్రాములు
పాలు... 400 గ్రాములు
మిరియాలపొడి... అరటీస్పూన్
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ఒక గిన్నెలో మష్రూమ్స్, ఉల్లిపాయల ముక్కలు కలిపి ఉడికించండి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్ లాగా తీసుకోవాలి (దీన్నె పూరీ అంటారు). వేరొక గిన్నెలో నెయ్యి, మైదాపిండి వేసి కొద్దిసేపు వేయించండి. తరువాత అందులో పాలు పోసి కలియబెడితే వైట్సాస్ తయారవుతుంది.
ఈ వైట్సాస్లో మష్రూమ్పూరీ వేసి కలిపి ఉడికించాలి. ఉడికిన తరువాత ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి సర్వ్ చేయండి. అంతే మష్రూమ్స్ తయారయినట్లే...! ఈ సూప్ను బౌల్స్లో పోసి సర్వ్ చేసే ముందు పాలక్రీమ్ మాత్రం చల్లడం మర్చిపోవద్దు.