Publish Date: Fri, 13 Jul 2007 (17:35 IST)
Updated Date: Fri, 13 Jul 2007 (17:35 IST)
కావలసిన పదార్థాలు :
ఛేజ్ : నాలుగు
ఉల్లిపాయలు : పది
శనగపప్పు : 3 స్పూన్లు
ఎండు మిర్చి : పదిహేను
చింతపండు : 50 గ్రాములు
నూనె : పావు కప్పు
పచ్చికొబ్బరి తురుము : ఒకటిన్నర కప్పు
జీలకర్ర : మూడు చెంచాలు
ధనియాలు : రెండు చెంచాలు
తయారీ విధానం :
ఉల్లిపాయలు, ఛేజ్ (బెంగుళూరు వంకాయలు)లను సన్నగా తరగాలి. బాణలిలో రెండు చెంచాలు నూనె వేసుకున్న తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగనిచ్చి వాటికి కొబ్బరి తురుము, వేయించిన శెనగపప్పు కలిపి మెత్తగా మిక్సీ వేసి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు దోరగా వేపి దాంట్లో తరిగిన చేజ్ ముక్కలు, రుబ్బి ఉంచిన మసాలా ముద్ద, చింతపండు పులుసు, తగినంత ఉప్పు, పసుపు వేసి తగినంత నీళ్లు పోసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించి దించి అందులో కొత్తిమీర చల్లితే ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే ఛేజ్ కర్రీ రెడీ. తీపిని ఇష్టపడేవారు ఈ కర్రీలో బెల్లం కూడా చేర్చుకోవచ్చు.