Publish Date: Mon, 19 Aug 2024 (21:09 IST)
Updated Date: Mon, 19 Aug 2024 (21:11 IST)
జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచి తెలియదు. శరీరం బలహీనంగా మారుతుంది. అలాంటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ రుచికరమైన ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. జ్వరంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.
అందుకని మటన్, పిజ్జా, పాస్తా తినడం మానుకోవాలి. వీటిలో సంతృప్త కొవ్వు, చీజ్ ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.
జలుబు, జ్వరం ఉంటే శీతల పానీయాలు తాగడం మంచిది కాదు. శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు, ఓఆర్ ఎస్ వాటర్ తాగాలి. బిర్యానీ వంటి ఫాస్ట్ ఫుడ్ ఫీవర్లో తినవద్దు. కోడికూర వంటి మాంసాహారం, బయటి ఆహారంలో ఉప్పు, నూనె, పంచదార ఎక్కువగా ఉంటాయి.