Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారులో యువతిపై నలుగురు టెక్కీల అత్యాచారయత్నం

కారులో యువతిపై నలుగురు టెక్కీల అత్యాచారయత్నం
, గురువారం, 25 నవంబరు 2021 (11:43 IST)
చెన్నై నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక యువతిపై నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అత్యాచారా యత్నానికి పాల్పడ్డారు. అదీ కూడా కదులుతున్న కారులో ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో  రాత్రిపూట గస్తీ పోలీసులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఒక యువతి మరో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దురైప్పాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో టెక్కీలుగా పని చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక నక్షత్ర హోటల్‌లో మందుపార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు పీకలదాకా మద్యం సేవించారు. 
 
ఆ తర్వాత తెల్లవారుజామున తమతమ ఇళ్లకు వెళ్లేందుకు అందరూ కలిసి ఒక కారులో బయలుదేరారు.  ఆ కారు హోటల్‌ను వీడి ప్రధాన రహదారి పైకి వెళ్లిన తర్వాత ఆ యువతిపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. దీంతో ఆ యువతి బిగ్గరగా కేకలు వేసింది. 
 
ఆ సమయంలో రోడ్లపై గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని గమనించి కారును, అందులోని టెక్కీలతో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక థౌజండ్ లైట్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకృతితో ఆడుకున్నారు...బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు...