Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పసిడి ప్రియులకు శుభవార్త : తగ్గిన బంగారం - వెండి ధరలు

పసిడి ప్రియులకు శుభవార్త : తగ్గిన బంగారం - వెండి ధరలు
, ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:20 IST)
దేశంలోని పసిడి ప్రియులకు ఓ శుభవార్త. కానీ, ఆదివారం మార్కెట్ ధరల ప్రకారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా బంగారం ధరలు ఇపుడు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. మరి నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
 
హైదరాబాద్ మార్కెట్‌లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,320గా ఉంది. అలాగే 8 గ్రాములు రూ.34,560గా ఉంది. 10 గ్రాములు ధర రూ.43,200గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి. 
 
ఇకపోతే, ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర.. ముంబైలో రూ.45,240, ఢిల్లీలో రూ.45,350, బెంగళూరులో రూ.43,200, చెన్నైలో రూ.43,570, కోల్‌కత్తాలో రూ.45,900 గా ఉంది. 
 
ఇక, హైదరాబాద్‌లో వెండి ధర నిన్నటితో పోల్చితే తగ్గింది. కేజీ వెండి ధర రూ.800 తగ్గింది. ఇక్కడ నేడు వెండి ధర 1 గ్రాము రూ.64.10గా ఉంది. అదే 8 గ్రాములు ధర రూ.512.80 గా ఉంది. 
 
అదే 10 గ్రాములు ధర రూ.641 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,410 ఉండగా, కేజీ వెండి ధర రూ.64,100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా వెండి ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో వ్యక్తి గల్లంతు