భారతదేశంలోని 6 వేదికలలో 517 మంది అభ్యర్థులు పాల్గొనగా "అతిపెద్ద పశువుల సంక్షేమ పాఠం" కోసం SMFG ఇండియా క్రెడిట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. కంపెనీ 7వ ఎడిషన్ పశు వికాస్ డేలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద ఒకరోజు పశువుల సంరక్షణ శిబిరాలు ద్వారా ఈ మైలురాయిని సాధించారు. ఈ శిబిరాలు 16 రాష్ట్రాలలోని 500 ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించబడ్డాయి, దీనిద్వారా దాదాపు 1,90,000 మంది లబ్ధిదారులు (1,50,000 పశువులు, 40,000 పశువుల యజమానులు) ప్రయోజనం పొందారు.
భారతదేశంలో, గ్రామీణ ప్రాంత జనాభాలో దాదాపు 65-70% మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడుతున్నారు. అందువల్ల, వారి జీవనోపాధి ఉత్పత్తి కార్యకలాపాలు, ఆర్థిక శ్రేయస్సులో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విడదీయరాని బంధాన్ని గుర్తించి, SMFG ఇండియా క్రెడిట్ 7వ ఎడిషన్ పశు వికాస్ దినోత్సవాన్ని "మేరా పశు మేరా పరివార్" అనే నేపథ్యంతో జరుపుకుంది, ఇది ఈ గ్రామీణ కుటుంబాల జీవితాల్లో పశువుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది.
వార్షిక PVD కార్యక్రమంలో 6,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు, ఇది గ్రామీణ సంక్షేమం పట్ల కంపెనీ నిబద్ధతను వెల్లడించింది.