Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్.బి.ఐ క్రెడిట్ వినియోగదారులకు శుభవార్త

ఎస్.బి.ఐ క్రెడిట్ వినియోగదారులకు శుభవార్త
, సోమవారం, 14 సెప్టెంబరు 2020 (09:48 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్.బి.ఐ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కష్టాల కారణంగా మారటోరియం తీసుకుని, గడువు ముగిసినా బకాయిలు చెల్లించని క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఎస్.బి.ఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు గడువును మరింత పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఖాతాదారులు భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకం, లేదంటే బ్యాంకు ప్రకటించిన రీపేమెంట్ గడువును ఎంచుకోవచ్చని ఎస్‌బీఐ కార్డ్స్ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్ తివారీ తెలిపారు. ఈ రెండింటిలోనూ వడ్డీ రేటు ఆకర్షణీయంగానే ఉంటుందని పేర్కొన్నారు. 
 
అయితే, ఇక్కడో కిటుకు ఉంది. ఎస్‌బీఐ రీపేమెంట్ పథకాన్ని ఎంచుకుంటే, మారటోరియడం గడువు ముగిసి బకాయిలు చెల్లించని ఖాతాదారుల వివరాలు సిబిల్‌కు చేరవని తివారీ స్పష్టం చేశారు. అంతమాత్రాన వారి పరపతి రేటింగ్‌కు ఎలాంటి ఢోకా ఉండదని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్.. ముమ్మాటికీ మ్యాన్ మేడ్ .. చైనా వైరాలిజస్టు